*జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలి*
*60:40 శాతం నిష్పత్తిని సవరించాలి* *నగరానికి చేరువగా స్థలాలు కేటాయించాలి* *ఈ ఏడాది అక్రెడిటేషన్ లేనివారికి న్యాయం చేయాలి* *విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకార్యవర్గసమావేశం తీర్మానం* విశాఖపట్నం,2024,జనవరి 25,టుడే న్యూస్ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ అధ్యక్షతన సొసైటీ కార్యవర్గ సమావేశం గురువారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై కార్యవర్గ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే నగరానికి చేరువగా స్థలాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం ఇళ్ల స్థలాల జీవోలో పేర్కొన్న విధంగా 60:40 నిష్పత్తిని సవరించాలని కోరారు. ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారుల వాటాగా చెల్లించాల్సి మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించాలని కోరారు. అదేవిధంగా సొసైటీలో సభ్యులుగా ఉన్నవారిలో 250 మంది వరకూ 2023