‘జగనన్న విద్యా దీవెన’ పథకంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఈ విద్యా సంవత్సరం (2020–21)లో తొలి త్రైమాసిక చెల్లింపులు:


- నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇస్తున్న ఆస్తి చదువు 

దీన్ని నేను గర్వంగా చెబుతున్నాను

- పిల్లల చదువులకు ఇబ్బంది పడకూడదు

- ఆ తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న ఉద్దేశం

- అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం

- పక్కాగా జగనన్న విద్యా కానుక పథకం అమలు

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి

అన్ని శాఖలు ఈ పథకాన్ని ఓన్‌ చేసుకున్నాయి

ఇందులో నేను పాలు పంచుకుంటున్నాను

ఇది నా ద్వారా జరగడం దేవుడిచ్చిన అదృష్టం

ప్రతి మూడు నెలలకు ఫీజు నేరుగా తల్లుల ఖాతాలో జమ

వారు ఆ ఫీజును వారం రోజుల్లో కాలేజీలకు చెల్లిస్తారు

కాలేజీలలో వసతులు లేకుంటే ప్రశ్నించే వీలు కలుగుతుంది.

కాలేజీ యాజమాన్యాలకు కూడా జవాబుదారీతనం వస్తుంది

6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం మొదలు..

మూడేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీలలో చేర్చడం..

ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలకు, తల్లులకు అండ

అంగన్‌వాడీలను ప్రిప్రైమరీ స్కూళ్లుగా మార్పు

ఇంగ్లిష్‌ మీడియమ్‌ కూడా ప్రవేశపెడుతున్నాం

నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు

రోజుకొక మెనూతో గోరుముద్ద. పిల్లలకు మేనమామలా తోడు

పిల్లలకు స్కూల్‌ బ్యాగ్, పుస్తకాలు, షూస్, బెల్టులు

విద్యాకానుకలో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్‌ డిక్షనరీ 

రకరకాల పథకాలతో పిల్లలకు అడుగడుగునా అండ

జగనన్న విద్యా దీవెన చెల్లింపుల సందర్భంగా సీఎం

అమరావతి:  విద్యా సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఎప్పటికప్పుడు జగనన్న విద్యా కానుక (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌)ను అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2020–21)లో తొలి త్రైమాసికానికి సంబంధించి 10,88,439 పిల్లలకు మేలు చేస్తూ, వారి తల్లుల ఖాతాల్లో రూ.671.45 కోట్లు జమ చేసింది. ఈ మేరకు క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, జగనన్న విద్యా కానుక పథకంలో పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం  వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..:

దేవుడిచ్చిన అదృష్టం:

‘అన్ని శాఖలు సమన్వయంతో, జగనన్న విద్యా కానుక పథకాన్ని ఓన్‌ చేసుకున్నాయి, ఇది నిజంగా గొప్ప కార్యక్రమం. ఇందులో పాలు పంచుకోవడం, ఇది నా ద్వారా జరగడం దేవుడిచ్చిన అదృష్టం. ఈ నెల 14న డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌గారి జయంతిని జరుపుకున్నాం. భారత రాజ్యాంగాన్ని రాసిన కమిటీకి అధ్యక్షులు అంబేద్కర్‌ గారు. ఒక పేద కుటుంబంలో, ఒక దళిత కుటుంబంలో, అప్పటి సమాజంలో చదవటానికి వీల్లేని కుటుంబంలో పుట్టిన బాబా సాహెబ్‌గారు.. అన్నింటికీ ఎదురీది ఎదుగుతూ, ఆనాటి భారతదేశంలో ఎవ్వరూ చదవనన్ని చదువులు చదివారు. చివరకు ఆయన రాజ్యాంగం కూడా రాశారు’.

చదువు ఎంతో ముఖ్యం:

‘పెద్ద చదువన్నది ఇప్పుడు ఒక కనీస అవసరంగా మారిపోయింది. పేదరికం నుంచి బయటపడేందుకు, మెరుగైన ఆలోచనలకు, మంచి ఉద్యోగానికి–ఉపాధికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, సమాజంలో గౌరవం పొందటానికి, ఒక మనిషి తన తరవాతి తరం భవిష్యత్తుకు మెరుగైన బాటలు వేయటానికి పెద్ద చదువన్నది కనీస అవసరంగా మారింది. నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇస్తున్న ఆస్తి చదువు అని గర్వంగా చెబుతున్నాను’.

‘15 సంవత్సరాలకు 10వ తరగతి, 17 ఏళ్ళకు ఇంటర్, 20–21 మధ్య డిగ్రీ పూర్తి చేసిన ఒక చెల్లెమ్మ... ఒక తమ్ముడు, తమకు 60–70 ఏళ్ళు వచ్చే వరకు ఆ చదువు పునాది మీదే తన భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి బేరీజు వేసుకోగలిగితే.. ఏ అప్పులు లేకుండా మంచి చదువులు చదివితే, వారి జీవితాలు ఎలా మారుతాయన్నది విజువలైజ్‌ చేసుకుంటే.. చదువు విలువ ఏమిటన్నది అర్ధమవుతుంది’.

వారి బాధలు విన్నాను. చూశాను:

‘ 9,79,445 మంది తల్లులు, దాదాపు 10.88 లక్షలకు పైగా పిల్లలకు మేలు కలిగించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో చాలా చోట్ల పిల్లలు, వారి తల్లిదండ్రులు తమ సమస్యలు చెప్పుకున్నారు. స్వయంగా వారి కష్టాలు, బాధలు చూశాను. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తున్నాను’.

గతంలో ఎవరూ చేయలేదు:

‘ఇవాళ రూ.675 కోట్లకు పైగా మొత్తాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఇస్తున్నాం. ప్రతి త్రైమాసికం ఫీజును, ఆ త్రైమాసికం పూర్తి కాగానే ఇవ్వగలగడం గొప్ప విషయం. గత ప్రభుత్వ హయాంలో 2014–2019 వరకు రూ.1880 కోట్లు బకాయిలు పెట్టి పోయారు. అప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇచ్చింది కూడా అరకొరనే. రూ.4,208 కోట్లు ఈ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద గత ఏడాది చెల్లించింది. ఆ విధంగా ఎక్కడా బకాయిలు లేకుండా చేశాం’.

‘ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి, కోవిడ్‌ వల్ల కాలేజీలు గత ఏడాది డిసెంబరులో మొదలు కాగా, తొలి త్రైమాసికానికి సంబంధించి ఇవాళ పేమెంట్లు చేస్తున్నాం. గత ఏడాది 10.11 లక్షల పిల్లలకు మేలు చేస్తే, ఈసారి ఆ సంఖ్య 10.88 లక్షలకు చేరింది. అంటే 77 వేల మంది పిల్లలు ఎక్కువయ్యారు. ఆ మేరకు 9,79,445 మంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. ఆ విధంగా వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తే, వారు వారం రోజుల్లో ఆ మొత్తం కాలేజీలకు చెల్లిస్తారు. ఇది గతంలో ఎవరూ చేయలేదు’.

అడిగే అవకాశం కలుగుతుంది:

‘ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే ప్రభుత్వం ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాలో వేస్తే, ఆ పిల్లవాడి తల్లి లేదా తండ్రి స్వయంగా కాలేజీకి వెళ్లి, ఫీజలు కట్టేటప్పుడు, ఆ కాలేజీలో లోపాలు ఉన్నా, వసతులు లేకపోయినా నిలదేసే అవకాశం ఉంటుంది. అలాగే 1902 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే, ప్రభుత్వం స్పందిస్తుంది. కాలేజీలో పరిస్థితి మారేలా చూస్తుంది. ఆ విధంగా తల్లులకు కాలేజీలను ప్రశ్నించే అవకాశం కలుగుతుంది. అదే విధంగా కాలేజీలలో జవాబుదారీతనం కూడా పెరుగుతుంది’.

పిల్లల కోసం ఎన్నెన్నో..:

‘6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం మొదలు.. మూడేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీలలో చేర్చడం.. ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలుస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తూ..  ప్రిప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేస్తున్నాం. అలాగే ఇంగ్లిష్‌ మీడియమ్‌ కూడా ప్రవేశపెడుతున్నాం. పౌష్టికాహారం సరఫరా చేస్తున్నాం. నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నాం. రోజుకొక మెనూతో గోరుముద్ద అమలు చేస్తున్నాం. అలా పిల్లలకు ఒక మేనమామలా తోడుగా నిలుస్తున్నాను’.

‘పిల్లలకు స్కూల్‌ బ్యాగ్, పుస్తకాలు, షూస్, బెల్టులు, యూనిఫామ్‌ సమకూర్చడంతో పాటు, ఈ ఏడాది నుంచి జగనన్న విద్యా కానుకలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ డిక్షనరీ కూడా ఇస్తున్నాం. పిల్లల చదువులకు ఇబ్బంది పడకూడదు, ఆ తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తోంది. అందుకే విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నాం. అదే విధంగా విద్యార్థుల హాస్టల్‌ ఖర్చుల కోసం వసతి దీవెన కూడా అమలు చేస్తున్నాం. ఆ విధంగా రకరకాల పథకాలతో పిల్లలకు అడుగడుగునా ప్రభుత్వం తోడుగా ఉంటుంది’.

‘ఎక్కడ కూడా కాలేజీలు స్పెషల్‌ ఫీజుల పేరుతో కానీ, మరే పేరుతో కానీ అదనంగా ఫీజులు వసూలు చేయకుండా అధికారులు చూడాలి. ప్రభుత్వం కచ్చితంగా విద్యార్థుల పూర్తి ఫీజు చెల్లిస్తుంది’.

చివరగా..

‘ఇవాళ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం ద్వారా మీ అందరికీ మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని వివరాలతో లేఖలు తల్లులకు లేఖ రాయడం జరిగింది. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురైనా 1902కు ఫోన్‌ చేయమని మరోసారి కోరుతున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ప్రభుత్వంపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.

విద్యార్థులకు అండగా ప్రభుత్వం: ఆదిమూలపు సురేష్‌. మంత్రి

– ‘గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఈ స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చాకే పూర్తి ఫీజు చెల్లిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అరకొర మాత్రమే ఇచ్చారు. కాలేజీలలో ఫీజు ఎక్కువగా ఉన్నా, ప్రభుత్వం చాలీచాలకుండా ఇస్తే, మన ప్రభుత్వం మాత్రం పూర్తి ఫీజు చెల్లిస్తూ, విద్యార్థులకు ఎంతో అండగా నిలుస్తోంది’

డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ ధర్మాన కృష్ణదాస్, విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సతీష్‌చంద్ర, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డితో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పథకం లబ్ధిదారులు, అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. శ్రీకాకుళం నుంచి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే మాట్లాడారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు