పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

చిత్రం
  విశాఖపట్నం,2024, మే 10, టుడే న్యూస్:  ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని, స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. ‘యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం’ అంటే అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణుసాన్నిధ్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరపిస్తారు. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలానిస్తాయని, అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలమని అంటారు. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల క్రూరస్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక్షుడు ఒకా

చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ ప్ర‌దానం

చిత్రం
మెగాస్టార్ చిరంజీవికి భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసింది. ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ఆయ‌న ఈ ప్ర‌తిష్టాత్మక పుర‌స్కారం అందుకున్నారు. క‌ళా రంగానికి చేసిన సేవ‌ల‌కు గాను చిరంజీవికి ఈ అవార్డును కేంద్రం ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

చిత్రం
   విశాఖపట్నం, 2024, మే 9, టుడే న్యూస్ : గురువారం భీమిలి నియోజకవర్గము లో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ సమన్వయకర్త కిరణ్ కుమార్ శర్మ  అధ్యక్షతన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమములో ముఖ్య అతిథులు గా పాల్గొన్న కూటమి పార్లమెంట్ అభ్యర్ధి  భరత్,  భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ  మాట్లాడుతూ దేశములో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ జాతి అభివృద్ధికి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత  నారా చంద్రబాబునాయుడు కి దక్కుతుంది అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో లో కూడా బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రేపు అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణుల హక్కులను కాపాడుతూ వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కార్యక్రమములో బ్రాహ్మణ ప్రముఖులు సుసర్ల హరి, పరిమి నాగేంద్ర, పురుషోత్తమరాజు, రామశాస్త్రి, బాబీ, ప్రైవేటు అర్చక పురోహిత సంఘ సభ్యులు  కాళిదాసు, సుదీర్, బాలు శర్మ,  కృష్ణశర్మ, కామేశ్వర శర్మ, శివగణేష్, విస్సు, మొదలైనవారు పాల్గొన్నారు.

అమర్నాథ్ కు మద్దతు తెలిపిన మత్స్యకారులు గంగవరం లో భారీ బైక్ ర్యాలీ

చిత్రం
  అక్కయ్యపాలెం,2024, మే 8, టుడే న్యూస్ : గాజువాక నియోజకవర్గం లో కీలక ప్రాంతమైన గంగవరం మత్స్యకారులు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కు పూర్తిగా మద్దతు ప్రకటించారు. బుధవారం సాయంత్రం 64 వార్డ్ అధ్యక్షులు ధర్మాల శ్రీను,85 వార్డ్ కార్పొరేటర్ బొడ్డు నరసింహపత్రుడు ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ జరిగింది.ఈ ర్యాలీ 64వ వార్డ్ గంగవరం జంక్షన్ నుండి గాంధీ విగ్రహం మీదుగా యాతపాలెం మీదుగా 64 వా వార్డ్ మస్జిద్ మీదుగా సాగింది.  సుమారు 500 మోటార్ బైక్లతో మంత్రి అమర్నాథ్ రోడ్ షో నిర్వహించారు. దీనికి అపూర్వ స్పందన లభించింది. గంగవరంలో ప్రతి ఇంటి నుంచి జనం బయటకు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమర్నాథ్ ను గెలిపిస్తామంటూ మత్స్యకార సంఘం నాయకులు భరోసా ఇచ్చారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ర్యాలీలో యువతతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ మత్స్యకారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారిని గౌరవంగా చూసుకున్నారని దాన్ని గుర్తుంచుకొని ఏకపక్షంగా మత్స్యకారులంతా వైసీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు అడుగడుగున

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

చిత్రం
 :      హైదరాబాద్,2024, మే 8,టుడే న్యూస్:  ఉత్తరాంధ్రలో కూటమికి ప్రజల మద్దతు బాగుందని నట్టి కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళంలోని 8 అసెంబ్లీ స్థానాలు కూటమివేనని ఆయన స్పష్టం చేశారు. ఇక విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో మాత్రం నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందన్నారు. వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ ప్రముఖులు సిదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలకు ఓటమి తప్పదన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం ఎంపీగా విజయం సాధిస్తారన్నారు. అయితే ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ నాయకులు భూములు భారీగా కబ్జా చేశారని ఆరోపించారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ లక్షా పదివేల ఓట్ల మేజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. కూటమికి సినిమా ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయపడ్డారు.సినిమా వాళ్లు ముందుకు రావాలని ఈ సందర్బంగా నట్టి కుమార్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌క

కన్నబాబుకు ప్రజలు బ్రహ్మరథం.

చిత్రం
    విశాఖపట్నం,2024, మే 8,టుడే న్యూస్: కాకినాడ  రూరల్ మండలం,  తూరంగి గ్రామంలో వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి, రాబోయే ఎన్నికల్లో పింక్ బ్యాలట్ బాక్స్ లోని 1వ నంబర్ లో ఉన్న ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు.ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైసీపీ ఐదేళ్ల వైఫల్యాలు, దుర్మార్గాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్న భువనేశ్వరి

చిత్రం
  విశాఖపట్నం,2024, మే 8,టుడే న్యూస్: *ప్రజలతో మమేకమవుతూ...ప్రజల్లో ఒకరిగా ముందుకు సాగుతున్న భువనమ్మ* • కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. • గ్రామ గ్రామాన భువనేశ్వరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. • పార్టీ కార్యకర్తలు పూలమాలలు, పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు. • రామకుప్పం మండలంలోని రామకుప్పం, బందార్లపల్లి, నెర్నెల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని భువనేశ్వరి పూర్తి చేశారు. • గ్రామస్తులను ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగిస్తూ, వారిలో చైతన్యాన్ని నింపుతున్నారు. • ఓటు విలువను ప్రజలకు అర్థమయ్యేలా భువనేశ్వరి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. • వైసీపీ ఐదేళ్ల వైఫల్యాలు, దుర్మార్గాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్న భువనేశ్వరి. • ప్రజా ప్రభుత్వ ఆవశ్యకతను వివరిస్తూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కుప్పం ప్రజలను చైతన్యపరుస్తున్న భువనేశ్వరి.

చంద్రబాబు నాయుడును కలిసి మద్దతు తెలిపిన: సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు

చిత్రం
హైదరాబాద్,2024, మే 8 ,టుడే న్యూస్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును కలిసి మద్దతు తెలిపిన సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు*  సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బుధవారం నాడు కలిసి మద్ధతు తెలిపారు.. ఈ సందర్బంగా బోర్డు ప్రెసిడెంట్ రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ... గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్ధుతుగా నిలిచామని గుర్తు చేశారు. సక్యులరిజానికి చంద్రబాబు నాయుడు ఐకాన్ గా నిలిచారని అన్నారు. మత సామర్యాన్ని కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. సామాజిక సమతుల్యాన్ని చంద్రబాబు ఎల్లప్పుడూ పాటిస్తున్నారు. ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణంతోనే అన్ని వర్గాలు అభివృద్ధికి సాధ్యమన్నారు. 2024 టీడీపీ మేనిఫెస్టో మైనారిటీ వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుంది. ముస్లీంల అభివృద్ధికి తోడ్పడే మేనిఫోస్టోని ప్రకటించిన టిడిపికి అభినందనలు తెలిపారు.  లాల్ జాన్ భాషా వంటి నాయకులను రాజ్యసభకు పంపించింది తెలుగుదేశం పార్టీనే అని గుర్తు చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ముఫ్తీలు, ఉలేమాలు, మత ప

హెడ్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త - మానవత్వo

చిత్రం
* అనాధ శవం - టూ వీలర్ పై మృతదేహం స్మశాన వాటికకు తరలింపు*  అక్కయ్యపాలెం,2024, మే 7,టుడే న్యూస్:   విశాఖ మహానగరం పరిధిలోని కొత్త గాజువాక ప్రాంతం.. హిమాచల్‌నగర్‌కు వెళ్లే రహదారి అది... రోడ్డు పక్కనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయి, విగత జీవిగా పడి ఉన్నాడు. వయసు దాదాపుగా 50 కి పైనే ఉంటుంది. గత కొంతకాలంగా అదే ప్రాంతంలో ఉంటూ యాచిస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఉన్నట్టుండీ ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. హెడ్ కానిస్టేబుల్ బి నారాయణ అక్కడకు వెళ్లి ఆరా తీశారు. మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ అంబులెన్స్, తోపుడు రిక్షా, సాయం కోసం ఎదురుచూశారు. కానీ ఎవరో ముందుకు రాలేదు. గంటలకొద్దీ వేచి చూసినా.. ఎవరు కనికరించలేదు. చలించలేదు. దీంతో సాయంత్రం వరకు వేచి చూసిన హెడ్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త తరుణ్ కు సమాచారం ఇచ్చారు. అతని సహకారంతో స్వయంగా 2 వీలర్‌పై మృతదేహన్ని తరలించారు. హెడ్ కానిస్టేబుల్ నారాయణ బైక్ డ్రైవ్ చేస్తుండగా, వెనకాల మృతదేహాన్ని తరుణ్ పట్టుకుని కూర్చున్నాడు. అక్కడి నుంచి అతి కష్టం మీద ఆ మృతదేహాన్ని జోగవా

విజయనగరం యువగళం సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్*

చిత్రం
  * ప్రజాప్రభుత్వం వచ్చాక విశాఖను ఐటి రాజధానిగా అభివృద్ధి చేస్తాం!* *5కోట్లమంది ఆంధ్రులు గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మిస్తాం!* *కుటుంబసభ్యులే నమ్మని జగన్ ను 5కోట్లమంది ప్రజలెలా నమ్మాలి?* *కూల్చడం మా బ్లడ్ లో లేదు, రుషికొండను ప్రజావసరాలకే వినియోగిస్తాం* *ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ సొమ్మంతా ఏ పందికొక్కులు తిన్నాయో చెప్పాలి*   హైదరాబాద్,2024, మే 7,టుడే న్యూస్:    విజయనగరం: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటి రాజధానిగా తీర్చిదిద్దుతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయనగరం ఎంఆర్ స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన యువగళం సభలో యువనేత పాల్గొన్నారు. కార్యక్రమానికి జర్నలిస్టు గోపి యాంకర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.... అధికారంలోకి వచ్చాక మూడునెలలకే జగన్ మూడు ముక్కలాట మొదలెట్టారు. కర్నూలు న్యాయరాజధాని, ఉత్తరాంద్రకు పరిపాలన రాజధాని, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి అన్నారు. కర్నూలులో ఒక్క ఇటుకలేదు, అమరావతిని సర్వనాశనంచేశాడు. విశాఖ పట్నంలో ఒక్క భవనమైనా కట్టారా? రుషికొండకు గుండుకొట్టి ఒక్