పోస్ట్‌లు

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*

విజయవాడ: వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ డివిజన్‌–1 కార్యాలయం ఇంటెలిజెన్స్‌ విభాగంలో జీఎస్టీ అధికారులు బి.మెహర్‌కుమార్, కె.సంధ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.వి.చలపతి, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఎం.సత్యనారాయణలను పోలీస్‌ కస్టడీకి తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా తెలిపారు. నలుగురు ఉద్యోగులు విధులను దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు రాష్ట్ర పన్నులశాఖ కార్యాలయం డిప్యూటీ కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 31వ తేదీన కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల్ని విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులు నలుగురికి రిమాండ్‌ విధించిందన్నారు. నలుగురు ఉద్యోగులు కార్యాలయంలోని పలు రికార్డులను తారుమారు చేశారని, ఈ అవినీతిలో మరి కొందరు అధికారుల పాత్రపై విచారించాల్సి ఉన్నందున నిందితులను తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరినట్లు చెప్పారు. న్యాయాధికారి ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నలుగురు ఉద్యోగులను పోలీస్‌ కస్టడీకి తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు.

ఘనంగా మాడుగుల కేజే.పురం శ్రీ సంతోషిమాత తీర్థ మహోత్సవం

చిత్రం
మాడుగుల,2023 ఫిబ్రవరి26,టుడే న్యూస్: మాడుగుల మండలంలో కేజే పురం జంక్షన్లో కొలువైన శ్రీ సంతోషిమాత అమ్మవారి తీర్ధ మహోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల అమ్మతల్లి నాయుడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగ నిర్వహించారు. అమ్మవారి తీర్ధం పురస్కరించుకొని గోపూజ, అమ్మవారికి అర్చనలు, కుంకుమ పూజలు, విశేష అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. వేకువ జాము నుండే అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు, మొక్కబడులు సమర్పించుకున్నారు. మధ్యాహ్నం సుమారు ఆరు వేల మంది భక్తులకు అన్న సమారాధనలో పాల్గొన్నారు. సాయంత్రం తీర్థం మహోత్సవంలో జబర్దస్త్ ఆర్టిస్టులతో ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమం, సాంసుకృతిక కార్యక్రమాలు, చిటికెల భజనలు, కొలాటాలు, చూపరులను ఎంత గానో అలరించాయి. ఈ తీర్ద మహోత్సవానికి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మంత్రి  కుమార్తె అనురాధ, పైలా ప్రసాద్, విజయనగరం డిఎస్పి వేగి వెంకట అప్పారావు, పలువురు ప్రముఖులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి తీర్ధ ప్రసాదములు స్వీకరించారు.

పబ్లిక్ రిలేషన్స్ సోసైటి ఆఫ్ ఇండియా, విశాఖపట్నం చాప్టర్

చిత్రం
  విశాఖపట్నం, 26 పిబ్రవరి, 2023, టుడే న్యూస్ : జి20 సమావేశాలతో పెరగనున్న భారత ప్రతిష్ఠ పి.ఆర్.ఎస్.ఐ. సమావేశంలో ఆర్థిక నిపుణులు అభివృద్ధి చెందుతున్న దేశాలకు , అభివృద్ధి చెందిన దేశాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రపంచ ఆర్థిక గమనంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశం త్వరలో ఆతిద్యం ఇవ్వనున్న జి20 సమావేశాల ద్వారా తన ప్రతిష్ఠ ను మరింతగా పెంచుకోనున్నదని ప్రముఖ ఆర్థిక మరియు అంతర్జాతీయ నిపుణురాలు, గీతం విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధా రఘరామ పాత్రుని పేర్కొన్నారు. భారత ప్రజాసంబంధాల  సంఘం (పి.ఆర్.ఎస్.ఐ) ఆధ్వర్యంలో ఆదివారం తేది.26.02.2023న ( దశపల్లా  హోటల్,  సూర్య భాగ్) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జి20 భారతదేశ పాత్ర అవకాశాలు అనే అంశంపై ఆమె ప్రసంగించారు. కోవిడ్, ఉక్రెయిన్ యుద్దం వంటి అంశాల వల్ల ఆహర, ఇంధన సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని ఈ స్థితిలో అటు సంపన్న దేశాలతో ఇటు వర్థమాన దేశాలతో సత్సంబంధాలు ఉన్న భారతదేశం నుంచి ప్రపంచం చాలా ఆశిస్తోందన్నారు. జి20 దేశాల మధ్య గల విభేదాల వల్ల కూటమి పై సన్నగిల్లిన విశ్వసనీయతను ఈ ఏడాది దేశంలో జరిగే సమావేశాల ద్వారా భారతదేశం పునరుద్దరించాల్సి ఉందని ఆమె అభిప్రాయ

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు

చిత్రం
*55వార్డులో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో - కె.కె రాజు  అక్కయ్యపాలెం,2023 ఫిబ్రవరి 11, టుడే న్యూస్:గడ  పగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వార్డు ధర్మానగర్ సచివాలయం 1086261 దర్మానగర్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్  కె.కె రాజు  55వార్డు కార్పొరేటర్ కె.వి.యన్ శశికళతో కలిసి పర్యటించారు. ముందుగా ధర్మా నగర్  అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పిచ్చి   అనంతరం ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా కె.కె రాజు  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్ జగన్మోహన్ రెడ్డి  అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లా ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు,వార్డు అధ్యక్షులు కె.పి రత్నాకర్,దుప్పలపూడి శ్రీనివాసరావు,డైరెక్టర్లు నూకరాజు,రాయుడు శ్రీను, 55వార్డు నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్,సొండి సురేష్,కరుణ,లక్ష

సత్యదేవ్ సేవలు సమాజంలో ఎంతో విలువైనవి

చిత్రం
విశాఖపట్టణం,2023 జనవరి 27, టుడే న్యూస్: సమాజంలో వివిధ రంగాలద్వారా గత నలభై అయిదు సం॥ కు పైగా  ప్రజా సత్సంబంధాల నేపధ్యంలో నిస్వార్ధంగా  సేవలనందిస్తున్న  చింతలపాటి సత్యదేవ్  సేవలు  విలువైనవని, ఆయన జీవన శైలి  ఆదర్శనీయమని సెంచ్యూరియన్  యూనివర్సిటీ   వైస్ ఛానల్స్‌ర్ ఫ్రొఫెసర్  జి. యస్.యన్. రాజు  కొనియాడారు . పబ్లిక్ రిలేషన్స్  సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్టణం  ఛాఫ్టర్ దస్పల్లా హోటల్‌లో శుక్రవారం   " బెస్ట్ పబ్లిక్ రిలేషన్స్ మేన్ " అనే అవార్డును  ఇచ్చి ఘనంగా  సత్యదేవ్‌ను సన్మానించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గని ప్రసంగించారు . ఆధ్యాత్మిక  జీవనానికి నికి,  సామాజిక సేవకు  ఆయన అంకితమై  జీవించడమనేది అరుదైన విషయమన్నారు.  సమాజంలో సత్సంబంధాలు  ఉంటే మహత్కార్యాలు  చేయవచ్చునడానికి సత్యదేవ్ ఒక ఉదాహరణ మన్నారు సెంచ్యూరియన్  యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్  జి. యస్. యన్. రాజు  సభలో  ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం ఫ్రొఫెసర్ డి. వి. ఆర్.మూర్తి మాట్లాడుతూ  సత్యదేవ్ జీవన విధానంలో, ఆయన రచనలలో గురుదేవులైన మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య  ప్రస్ఫుటంగా గోచరిస్తుందన్నారు . ప్యభుత్వ అధికారులతో

ప్ర‌జ‌ల కోసం..రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం నారా లోకేష్ తొలి అడుగులు

చిత్రం
 హైదరాబాద్,2023 జనవరి 25, టుడే న్యూస్: అన్యాయానికి గురైన ప్ర‌జ‌ల‌కు అండ‌గా, ధ్వంస‌మైన రాష్ట్రం పున‌ర్మిర్మాణం ల‌క్ష్యంగా టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ``యువ‌గ‌ళం`` పేరుతో పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. కుప్పం నుంచి శుక్ర‌వారం ఆరంభ‌మై, 4 వేల కిలోమీట‌ర్లు, 400 రోజుల‌పాటు సాగే యాత్ర‌కి శ్రీకారం చుట్టారు. హైద‌రాబాద్ నివాసంలో బుధ‌వారం ఉద‌యం కుటుంబంతో పూజ‌లు నిర్వ‌హించారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న లోకేష్, అత్తామామ‌లు, బంధువులంద‌రి ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా టిడిపి అధినేత చంద్ర‌బాబు కొడుకుని హ‌త్తుకుని ఉద్విగ్నానికి గుర‌య్యారు. ``వెళ్లొస్తాను నాన్నా`` అంటూ తండ్రికి చెప్పిన లోకేష్‌.. త‌న బిడ్డ దేవాన్ష్‌ని అక్కున చేర్చుకుని ``వీడియో కాల్ లో మాట్లాడుకుందాం చిన్నా`` అని స‌ముదాయించి బ‌య‌లుదేరారు.  భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు తాత నంద‌మూరి తార‌క‌రామారావుకి నివాళులు అర్పించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకుని క‌డ‌ప వెళ్లారు. కడపలో నారా లోకేశ్ కి టీడీపీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికాయి. దేవుని క‌డప వెంకటేశ్వరస్వామ

మంత్రి అమర్నాథ్ ఇంట ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

చిత్రం
-- భోగి వేడుకల్లో పాల్గొన్న అమర్నాథ్ కుటుంబ సభ్యులు విశాఖపట్నం, 2023 జనవరి 14, టుడే న్యూస్ : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం భోగి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి ప్రతి కుటుంబంలోనూ ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. తాను మంత్రిని అయిన తర్వాత జరుగుతున్న తొలి పండుగ ఇది అని అమర్నాథ్ చెబుతూ రాష్ట్రంలో పేద, గొప్ప అనే తారతమ్యం లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను అందజేస్తున్నారని, వీటి వలన పేదరికం చాలావరకు తగ్గిందని ఆయన అన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడంతో రైతుల ఆనందంగా ఉన్నారని ఆయన చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు మరింత సుభిక్షంగా ఉంటారని మంత్రి అమర్నాథ్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.

సమస్యలు పరిష్కారం కోసం త్వరలో ఛలో ఢిల్లీ

చిత్రం
* జర్నలిస్టు ల సంక్షేమమే పరమావధి*  *సంక్రాంతి ఆనందో త్సాహాలు తేవాలి* అక్కయ్య పాలెం,2023 జనవరి 13, టుడే న్యూస్ : జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ లు సంక్షేమానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషీ చేయడం జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు తెలిపారు.. శుక్ర వారం ఇక్కడ అక్కయ్య పాలెం ప్రధాన జంక్షన్ లో ఉన్న ఒక ప్రైవేటు కార్యాలయం లో సంక్రాంతి పండుగ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు 600 కేజీ లు కొత్త బెల్లం( ఏటువంటి రసాయనాలు మిళితం కానీ),సింహాచలం కాలెండర్ లు అందచేశారు... ఈ సందర్భముగా గా శ్రీను బాబు మాట్లాడుతూ త్వరలో ఢిల్లీ వేదికగా 13 రాష్ట్రాల జర్నలిస్ట్ ల అసోసియేషన్ లతో ప్రత్యేక సమావేశము జరగ నుందన్నారు.. ఆ సమావేశంలో జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ లు కు సంబంధించి పలు సమస్యలని పరిష్కరించాలని కోరడం జరుగు తుంది అని, అందుకు తగ్గట్లు గా అవసరమైన తీర్మానాలు అప్పుడే చేస్తామన్నారు..  రాష్ట ప్రభుత్వము పరిదిలో సమస్యలు పరిష్కారం కోసం తగిన విజ్ఞాపనలు అంద చేయాలని నిర్ణయము తీసుకోవడం జరుగుతుందన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా మన్నారు..  ప్రతి యేట

కెజిహెచ్ లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: - జిల్లా కలెక్టర్ డా. ఎ . మల్లికార్జున .

చిత్రం
కెజిహెచ్ ఓ పి కౌంటర్ వికేంద్రీకరణకు ఆదేశాలు. మొత్తం ఏడు ప్రభుత్వ ఆసుపత్రులలో 73 పనులకు గాను రూ. 4,15,66,657 /- లకు అనుమతి మంజూరు. విశాఖపట్నం,2023 జనవరి 10, టుడే న్యూస్: కెజిహెచ్ ఆసుపత్రి కి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ . మల్లికార్జున వైద్యాధికారులకు సూచించారు. మంగ‌ళ‌వారం  ఉదయం కెజిహెచ్  సమావేశ మందిరంలో  జ‌రిగిన‌ కెజిహెచ్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రి ల యొక్క అభివృద్ధి క‌మిటీ స‌మావేశంలో ఆయ‌న ప‌లు మార్గ‌ద‌ర్శకాలు జారీ చేశారు. స‌మావేశంలో భాగంగా ముందుగా కేజీహెచ్ కి సంబంధించి సూప‌రింటెండెంట్ అజెండా అంశాల‌ను ప్ర‌స్తావించారు. గ‌త స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను క‌మిటీకి వివ‌రించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కెజిహెచ్ లో  రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రిని  అభివృద్ధి చేయాలని  అన్నారు. ఆసుప‌త్రి అభివృద్ధికి, మౌలిక వ‌స‌తుల క‌ల్పన‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేశారు. ఎం.ఆర్‌.ఐ. స్కానింగ్ మెషిన్ రావటానికి మరికొంత సమయం ఆలస్యం కారణంగా ప్రజలకు అసౌక్యరం కలుగకుండా అవుట్ సోర్సి

రేషన్ సరుకుల పంపిణీలో పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు

చిత్రం
                          విశాఖపట్నం,2023 జనవరి10,టుడే న్యూస్: చౌకధరల దుకాణాలలో మరియు ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాలలో  సరుకుల పంపిణీలో పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు అన్నారు. మంగళవారం సాయంత్రం సివిల్ సప్లై అధికారి సూర్య ప్రకాష్ రావుతో కలిసి ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు నగరంలో పలు రేషన్ డిపోలను, రేషన్ పంపిణీ వాహనాలను తనిఖీ చేశారు. ముందుగా పూర్ణా మార్కెట్ ఏరియాలో గల డిపో నెంబర్ 0386149 ను తనిఖీ చేశారు. బియ్యం స్టాక్ ఎంత వచ్చింది, ఎంత పంపిణీ చేశారు, ఎంతమంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, రైస్ కార్డ్లు ఎన్ని ఉన్నాయి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కార్డ్ హోల్డర్స్ తో మాట్లాడి రేషన్ పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని, తక్షణ చర్యలు చేపడతామన్నారు. అనంతరం రైల్వే న్యూ కాలనీ దగ్గరలో గల చౌకధర దుకాణం నెంబర్ 39 ని తనిఖీ చేసి స్టాక్ సరిగా లేనందున మరియు రిజిస్టర్ సక్కమంగా లేనందున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. అనంతరం హెచ్ బి కాలనీ సీతమ్మధారలో డిపో నెంబర్ 569ను తనిఖీ చే