*మృగంలా ప్రవర్తించిన భర్తను వెంటనే అరెస్టు చేయాలి*

*చట్టీ అమానుష ఘటనను ఖండించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి*


*ఘటనపై తూ.గో.ఎస్పీ నయీం హస్మీ తో మాట్లాడిన  పద్మ*

*బాధిత మహిళలకు మహిళా కమిషన్ అండగా వుంటుంది*.

అమరావతి ,ఏప్రిల్ 19:
తూర్పుగోదావరి ఏజన్సీ చింతూరు మండలం చట్టి గ్రామంలో తన ఇద్దరు భార్యలు సుమతి,జయమ్మలపై భర్త  కళ్యాణం వెంకన్న  చేసిన పాచవిక దాడి, హత్యాయత్నాలు అమానుషం- అని మాహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు..
చట్టీ లో ఈ  అమానుషఘటనపై వెంటనే స్పందించిన ఆమె తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయిం హస్మీ తో ఫోన్ లో మాట్లాడారు.  ఈఘటన పై సత్వతమే చర్యలు తీసుకుని ఆ మహిళలిద్దరకూ రక్షణ కల్పించాలని, మృగంలా ప్రవర్తించిన భర్త కళ్యాణం వెంకన్న ను తక్షణమే అరెస్టు చేసి కఠిన సెక్షన్లు పెట్టాలని మాహిళా కమిషన్  చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఆదేశించారు. ఇదరిని పెళ్ళాడటం తప్పు అయినా అనుమానాలతో ఇద్దరు భార్యలుపై మృగంలా ప్రవర్తించి అత్యంత క్రూరంగా చిత్రహింసలకు గురిచేసిన ఆ ఘటనలు చూస్తుంటే మనం ఏ సమాజంలో ఎక్కడున్నామోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భార్యలను చిత్రహింసలు పెడుతూ
మరో వ్యక్తితో  సెల్ లో వీడియో తీయించడం మరీ దారుణమన్నారు. ఈ నెల 3న  ఘటన జరిగినా  15 రోజులకు ధైర్యం చేసి బాధిత మహిళలు ముందుకొచ్చి చింతూరు  పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఒక భార్య పై పెట్రోలు పోసి, వేడివేడినీళ్ళల్లో చేతులు ముంచి చిత్రహింసలు, మరో భార్యను
 చేతులు కట్టేసి అత్యంత దారుణం గా కాళ్ళతో తొక్కిపెట్టి  కటింగ్ ఫ్లయర్ ,కత్తితో చెవి, ముక్కు కత్తిరిస్తున్న దృశ్యాలు చూస్తుంటే గుండెతరక్కుపోతుందని, కనీసం మానవత్వం చూపకుండా పిల్లల ఎదుటే అంత దారుణానికి ఒడిగట్టిన వెంకన్న కఠిన చర్యలు తప్పవన్నారు. విచక్షణా రహితంగా ప్రవర్తించి హత్యాయత్నం చేసిన కల్యాణం వెంకన్నను వెంటనే పోలీసులు అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మహిళలు అతని నుంచి తప్పించుకుని పుట్టింటికి పారిపోకపోతే వారి ప్రాణాలతో దక్కేవికావన్నారు. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న  యువతులు ధైర్యంగా ముందుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. మహిళల రక్షణకు సిఎం జగన్   అండగా వున్నారని, మహిళల హక్కులు , రక్షణకు కఠినమైన . 
 చట్టాలతో చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
మహిళా కమిషన్ బాధితులకు అండగా నిలబడుతుందని, . వేధింపులు,  సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.
----
కాకినాడ అశోక్ నగర్ లో యువతులను చదివిస్తున్న రాజేశ్వర్ దయాళ్ సాయం ముసుగులో ఆ యువతులను లైంగిక వేధింపులకు గురిచేయడం అమానుషం- --- మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. 
ఈ ఘటనలో బాధిత యువతులకు రక్షణ కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం హస్మీ ని ఆదేశించారు. యువతులను వేధిస్తున్న  రాజేశ్వర్ దయాళ్
 పై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  అన్నారు..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు