మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరణ



వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ,  ప్రగతి భారత్ పౌండేషన్ సహకారంతో ఈనెల 24 ,25  తేదిలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం  సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో  కె కె రాజు  ఆధ్వర్యంలో  జరిగినది. ఈ సందర్భంగా కె కె.రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు విజయసాయి రెడ్డి  మరియు ప్రగతి భారత్ పౌండేషన్ సహకారంతో ఈ నెల 24 25 తేదీలలో  విశాఖపట్నం లో మెగా జాబ్ మేళా నిర్వహించి సుమారు 4000 మంది యువతీ, యువకులకు ఉపాధి కల్పించబోతున్నామని ఆన్నారు. ఈ అవకాశాన్ని యువత  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో ఉత్తర నియోజకవర్గం పరిధిలోగల కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు మహిళలు పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు