*భక్తులకు ఆరు రోజులు దర్శనాలుండవు*

   సింహాచలం దేవస్థానం:   శ్రీశ్రీశ్రీ     వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు భక్తులకు దర్శనాలుండవు. అర్చకుల విజ్ఞప్తి  మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో  ఆలయాన్ని (భక్తులకు) మూసివేయాలని ఈఓ సూర్యకళగారు నిర్ణయించారు.  ఏడాదిలోనే అతిపెద్ద ఉత్సవం... చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నారు. లక్ష మందికిపైగా తరలివచ్చే ఉత్సవమే అయినా ప్రజల ఆరోగ్యేం దృష్యా ఈ నిర్ణయం తీసుకోవడమైనది. భక్తులకు అనుమతిలేకపోయినా... స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలూ ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు వరకు యథావిథిగానే జరపబడును. స్వామివారి సేవలకు ఎలాంటి లోటు ఉండబోదు. 10-05-21 నుంచి 15-05-21 వరకు భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ ఇదే తరహా నిర్ణయాలు తీసుకోవడమైనదని గుర్తించి...అందరూ సహకరించాలని ఈఓ సూర్యకళగారు కోరారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు