ఉత్తరాఖండ్లో బ్లాక్ ఫంగస్ కారణంగా మరో వ్యక్తి మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రోజురోజుకూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో 72 ఏళ్ల మహిళ రిషికేశ్లోని ఎయిమ్స్లో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కు గురైందని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో ఈ వ్యాధి కారణంగా రెండు మరణాలు సంభవించాయని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. ఇన్ఫెక్షన్ కారణంగా 36 ఏళ్ల వ్యక్తి శుక్రవారం మరణించాడని వైద్యులు చెప్పారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మరో ఐదుగురు రోగులను ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు చెప్పారు.