*55వార్డులో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో - కె.కె రాజు అక్కయ్యపాలెం,2023 ఫిబ్రవరి 11, టుడే న్యూస్:గడ పగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వార్డు ధర్మానగర్ సచివాలయం 1086261 దర్మానగర్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు 55వార్డు కార్పొరేటర్ కె.వి.యన్ శశికళతో కలిసి పర్యటించారు. ముందుగా ధర్మా నగర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పిచ్చి అనంతరం ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లా ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు,వార్డు అధ్యక్షులు కె.పి రత్నాకర్,దుప్పలపూడి శ్రీనివాసరావు,డైరెక్టర్లు నూకరాజు,రాయుడు శ్రీను, 55వార్డు నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్,సొండి సురేష్,కరుణ,లక్ష