"నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఉబీ లో దిగి పోవడంతో నలుగురు మృతి "

 విశాఖ  ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ

చాపరాతి పాలెం గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఉబీ లో దిగి పోవడంతో నలుగురు  మృతి చెందారు  

గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయితీ చాపరాత్రి పాలెం గ్రామానికి చెందిన  1,గడుతూరి నూకరాజు  :(35)

2 గడుతూరి తులసి (7)

3, గడుతూరి లాస్య( 5)

4, పాతూని రమణ బాబు (25)

వీరు నలుగురు కలిసి బొంతు వలస  కాలువలో చేపలు పట్టుటకు నిన్న ఉదయం బయలుదేరి వెళ్లారు నిన్న సాయంత్రం ఐదు గంటలకు  కాలువలు చేపలు పడుతుండగా ప్రవాహం దొంగ ఊబిలోకి ఒక్కసారిగా దిగడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు వారితో వచ్చిన మరో  ఒక చిన్నారి పాప ఒడ్డు పైన ఉండుట వలన ఆ పాప వెళ్లి జరిగిన సంఘటన చాపరాతి పాలెం గ్రామస్తులకు తెలియ పరచగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఒకే కుటుంబానికి మృతిచెందిన తండ్రి ఇద్దరు కుమార్తెల ను  తీయగలిగారు మరొక వ్యక్తి ఊబి లో కూరుకుపోవడం వలన తీయలేక  ఈరోజు తెల్లవారుజామున తీశారు  విషయం తెలుసుకున్న జీకేవీధి పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం  పంచనామా నిమిత్తం చర్యలు చేపడుతున్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు