ఆనందపురం పోలింగ్ సెంటర్ ను పరిశీలించిన: జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున



విశాఖపట్నం, నవంబరు 10, టుడే న్యూస్: 
పోలింగ్ కేంద్రాలలో అన్నీ మౌలిక వసతులు

కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్టున అధికారులను ఆదేశించారు.

బుధవారం ఆయన జెడ్.పి.టి.సి. ఎన్నికలు జరిగే ఆనందపురం మండలంలో

ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. జెడ్.పి. ఉన్నత పాఠశాలలో వున్న

పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని

అధికారులను, హెచ్.ఎం.ను ఆదేశించారు. పాఠశాల విద్యార్ధులతో

ముచ్చటించారు. తరువాత ఆనందపురం ఎం.పి.డి.వో కార్యాలయంలో

డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చేశరు.

గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. తరువాత గంభీరం గ్రామంలో గ్రామ

సచివాలయాన్ని సందర్శించారు. వారి పనితీరును పరిశీలించారు. ప్రభుత్వ

పథకాలను ప్రద్ర్శించాలని, వాటిపై ప్రజలకు పూర్తి అవగాహన

కల్పించాలన్నారు. ప్రజల నుండి వచ్చే సమస్యలపై వెంటనే

స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో లవరాజు,

ప్రధానోపాధ్యాయుడు కె.ఆర్.కె.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు