ఘనంగా పోలమాంబ అమ్మవారి రాట
ఆరిలోవ : జీవీఎంసీ 9 వార్డు, సంజయ్ గాంధీ కాలనీ గ్రామ దేవత శ్రీ పోలమాంబ అమ్మవారి పంచ రాత్రి జాతర మహోత్సవాలు ఈ నెల 8 నుండి 12 వరకు జరుపు సందర్బంగా ఆదివారం అమ్మవారి పండుగ రాట మహోత్సవాన్ని ఆలయ ధర్మకర్త కంచు మూర్తి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వి. ఎమ్. ఆర్. డి .ఏ చైర్ పర్సన్ విశాఖ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల వెంకట్రావు దంపతులు , 9 వ వార్డు కార్పొరేటర్ కోరుకొండ వెంకటరత్న స్వాతి దాస్ దంపతులు హాజరైన అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు . అనంతరం వారి చేతుల మీదుగా పండుగ రాట వేశారు . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు పోలమాంబ అమ్మవారిని దర్శించు కోవాలంటే ఆరిలోవ ప్రాంత ప్రజలు దూరంగా వెళ్లవలసి వచ్చేదని ఇప్పుడు గ్రామ గ్రామానికి దేవతగా ప్రతి గ్రామంలో అమ్మవారి దేవాలయాలు వెలిశాయని అన్నారు . పధ్నాలుగు గ్రామాల దేవత శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని జాతరను విజయవంతం చేయాలని కోరారు . కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కంచు మూర్తి నాగరాజు , ఆలయ అధ్యక్షులు ఒమ్మి రాజు ఆలయ కమిటీ జాతర కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు, సంజయ్ గాంధీ కాలనీ యూత్ అసోసియేషన్ సభ్యులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.