*మహానాడు నిర్వహణకు ప్రభుత్వ అడ్డంకులపై టిడిపి మండిపాటు*


*40 ఏళ్ల ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా మహానాడు*

*మొదటి రోజు ప్రతినిధుల సభకు 12 వేల మందికి ఆహ్వానం*

*రెండో రోజు అదే ప్రాగణం లో భారీ బహిరంగ సభ*

*మహానాడు నిర్వహణపై కమిటీలతో చంద్రబాబు సమీక్ష*

అమరావతి,టుడే న్యూస్:  తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని చెప్పారు. ఇదే సమయంలో భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్ధేశం చేసేలా కార్యక్రమం ఉండాలని అభిప్రాయ పడ్డారు. వివిధ వర్గాలనుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రభంజనంలా మహానాడుకు ఉండబోతుంది అని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఈ నెల 27,28 తేదీల్లో ఒంగోలు లో నిర్వహిస్తున్న మహానాడుపై కమిటీలతో చంద్రబాబు సమీక్షించారు. ఆయా కమిటీ పనితీరును సమీక్షించిన చంద్రబాబు పలు సూచనలు చేశారు. మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు 12 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు పార్టీ నేతలు వివరించారు. ఇక రెండో రోజు జరిగే బహిరంగ సభను లక్షల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు.

ఒంగోలులో మహానాడు నిర్వహణ తలపెట్టిన నాటినుంచి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని టిడిపి నేతలు మండి పడ్డారు. మొదట ఒంగోలులోని మీని స్టేడియం ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం...తరువాత కూడా పలు అడ్డంకులు సృష్టిస్తుందని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మహానాడుకు వాహనాలు సమకూర్చుకునే విషయంలో రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని నేతలు చెప్పారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అధికారులు కావచ్చు...ఇటు ప్రభుత్వం లోని వ్యక్తులు కావచ్చు.....వీటికి భవిష్యత్ లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని ఆయన అన్నారు. మహానాడు అనేది పార్టీ పండుగ అయినప్పటికీ...ఈ సారి ప్రజలను నుంచి భారీ మద్దతు లభిస్తుందని చంద్రబాబు అన్నారు. మహానాడుకు సౌకర్యాలు,వేదిక నిర్మాణం, భోజన, వసతి  కల్పనలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈవిషయంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన...రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి దర్పణం అని చంద్రబాబు అన్నారు. తన రాయలసీయ పర్యటనకు కూడా పోలీసులు సహకరించలేదని... మహానాడుకు కూడా వారు సహకరించే అవకాశం లేదని చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యకర్తల సహకారంతోనే కార్యక్రమం పటిష్టంగా నిర్వహించుకోవాలని సూచించారు. దీని కోసం ఎప్పుడూ ఉండే పార్టీ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఇకపోతే మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 15 తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. దీనిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తీర్మానాల కమిటీ ప్రతిపాదనలు సిద్దం చేస్తుంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు