ఘనముగా బంగారమ్మ పండుగ


  


పసుపు. కుంకుమలు సమర్పించుకున్న ప్రజల

సింహాచలం,జూన్21,టుడే న్యూస్: సింహాద్రి అప్పన్న సోదరి ,అడివి వరం గ్రామ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ బంగారమ్మ  తల్లి పండుగ మహోత్సవం మంగళవారం అత్యంత ఘనంగా  నిర్వహించారు.. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆలయ ఈవో  సూర్య కళ ఆధ్వర్యంలో ఈ పండుగను ఘనంగా జరిపించారు ..ఉత్సవంలో భాగంగా అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం పవిత్ర జలాలతో అభిషేకం చేసి ఆరాధన జరిపించారు. సాయంత్రంఅనుపు మహోత్సవం వైభవంగా జరిపించారు.. ఈ కార్యక్రమంలో అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం