తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం టీడీపీ -టీయెస్ ప్రోగ్రామింగ్ కమిటీ మాజీ కన్వీనర్ కీ!శే జి. బుచ్చిలింగం గారి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనకాపల్లి: జిల్లా పంచాయతీ అధికారి ని శ్రీమతి ఆర్ శిరీష రాణి నేడు ఉదయం తుమ్మపాల గ్రామపంచాయతీ సందర్శన చేసినారు గ్రామపంచాయతీ పరిధిలో గౌరపేటవీధి ఏరియా కొనతాల వారి దిబ్బఏరియా నందు ఉన్న డ్రైనేజ్ శివాలయం మీదగా మంచినీటి కోనేరు లోనికి వెళుతుందని దని సదరు డ్రైనేజి నీరు మళ్ళించు టకు స్థానిక రైతు సంఘం వారు గవర పేట వీధి రైతు సంఘం వారు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ అనకాపల్లి జిల్లా వారికి ఫిర్యాదు చేసినారు సదరు ఫిర్యాదుపై విచారణ చేపట్టి తదుపరి చర్యలు గయ కొనవలసిన జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేపట్టి స్థానిక గవరపేట రైతు సంఘం వారి సమక్షంలో సర్పంచ్ తట్ట పెంటయ్యనాయుడు సూచనల మేరకు కాలువ దారి మళ్ళించి విషయంలో లెవెల్స్ నమోదు చేయుట సాంకేతిక పీజ్బులిట్ రిపోర్టు తయారు చేయుటకు ఏ ఈ ఆర్డబ్ల్యూఎస్ అనకాపల్లి వారికి సూచనలు ఇచ్చి ఉన్నారు తదుపరి శివాలయం వీధి గవరపేట కొణతాల ది బ్బ ఏరియా పారిశుద్ధ్యం పరిశీలన చేసి ఆ పరిశుద్ధ పరిస్థితులు ఉన్నచోట తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా పంచాయతీ కార్యదర్శి వారిని ఆదేశించి ఉన్నారు అటులనే వాటర్ సప్లై కి సంబంధించిన లీకేజీలు ఉన్నచోట తక్షణమే రిపేరు చేయ
విశాఖపట్నం: టుడే న్యూస్, జనవరి:-27 పేదల వైద్యుడిగా, పోలియో వ్యాధి బాధితుల పాలిట ఆత్మబంధువుగా పేరు గాంచిన ప్రముఖ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ పురస్కారం లభించడం మన తెలుగు వారందరికీ గర్వకారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు ఇటివల కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలలో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణరావును ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా వైద్య రంగంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారని మంత్రి కొనియాడారు. పోలియో ఆపరేషన్స్ లో వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో గర్వించే విషయమని అన్నారు. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయనకు దక్కిన పద్మ పురస్కారం మొత్తం వైద్యరంగానికే వచ్చిన గుర్తింపు అని మంత్రి అన్నారు. ఓపక్క వైద్య వృత్తితోపాటు మరోపక్క వైద్య రంగంలో విద్యార్ధులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరింత మంది పేద ప్రజలకు వైద్యం అందించాలని మంత్రి
విశాఖపట్నం,ఎన్ఎన్ఇ న్యూస్: నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమ సుందరరావు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారాన్ని అందుకున్నారు. మహాకవి శ్రీశ్రీ 112 వ జయంతి సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యాన ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో శనివారం జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కవి సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో కవులు రచయితలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ కళా వేదికకు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ అందిస్తున్న మీడియా సహకారానికి కృతజ్ఞతగా ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆరవల్లి నరేంద్ర ఇతర ప్రతినిధులు పూలమాలవేసి దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు.