తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం టీడీపీ -టీయెస్ ప్రోగ్రామింగ్ కమిటీ మాజీ కన్వీనర్ కీ!శే జి. బుచ్చిలింగం గారి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
: హైదరాబాద్,2024, మే 8,టుడే న్యూస్: ఉత్తరాంధ్రలో కూటమికి ప్రజల మద్దతు బాగుందని నట్టి కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళంలోని 8 అసెంబ్లీ స్థానాలు కూటమివేనని ఆయన స్పష్టం చేశారు. ఇక విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో మాత్రం నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందన్నారు. వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ ప్రముఖులు సిదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలకు ఓటమి తప్పదన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం ఎంపీగా విజయం సాధిస్తారన్నారు. అయితే ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ నాయకులు భూములు భారీగా కబ్జా చేశారని ఆరోపించారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ లక్షా పదివేల ఓట్ల మేజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. కూటమికి సినిమా ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయపడ్డారు.సినిమా వాళ్లు ముందుకు రావాలని ఈ సందర్బంగా నట్టి కుమార్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. చ...
విశాఖపట్నం, 2024, మే 9, టుడే న్యూస్ : గురువారం భీమిలి నియోజకవర్గము లో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ సమన్వయకర్త కిరణ్ కుమార్ శర్మ అధ్యక్షతన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమములో ముఖ్య అతిథులు గా పాల్గొన్న కూటమి పార్లమెంట్ అభ్యర్ధి భరత్, భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ మాట్లాడుతూ దేశములో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ జాతి అభివృద్ధికి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబునాయుడు కి దక్కుతుంది అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో లో కూడా బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రేపు అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణుల హక్కులను కాపాడుతూ వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కార్యక్రమములో బ్రాహ్మణ ప్రముఖులు సుసర్ల హరి, పరిమి నాగేంద్ర, పురుషోత్తమరాజు, రామశాస్త్రి, బాబీ, ప్రైవేటు అర్చక పురోహిత సంఘ సభ్యులు కాళిదాసు, సుదీర్, బాలు శర్మ, కృష్ణశర్మ, కామేశ్వర శర్మ, శివగణేష్, విస్సు, మొదలైనవారు పాల్గొన్నారు.
విశాఖపట్నం,2024, మే 10, టుడే న్యూస్: ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని, స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. ‘యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం’ అంటే అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణుసాన్నిధ్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరపిస్తారు. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలానిస్తాయని, అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలమని అంటారు. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల క్రూరస్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక...