అనాథ నిరుపేద బాల బాలికల కు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 2005 సంవత్సరం నుంచి ఉచిత విద్య:నారా భువనేశ్వరి


హైదరాబాద్, జూలై 3,టుడే న్యూస్: కృష్ణా జిల్లా చల్లపల్లి లోని ఎన్టీఆర్ ( NTR ) ఉన్నత పాఠశాలలో 6 , 7 , 8 , 9 తరగతుల్లో ఒక్కో దానిలో పది మంది చొప్పున 40 మంది కి ( DAY SCHOLAR ) ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు NTR Memorial Trust Managing Trustee  శ్రీమతి నారా భువనేశ్వరి  వెల్లడించారు. అర్హత మరియు ఆసక్తి గల  విద్యార్థి విద్యార్థినులు ఈ నెల 9 సాయంత్రము 4 గంటల లోపు సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని కలిసి  వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు . అందుబాటులో ఉన్న ప్రవేశాలకంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే జూలై 10న  ఉదయం 10 గంటలకు పాఠశాల ప్రాంగణంలో  ప్రతిభా పరీక్ష నిర్వహించి విద్యార్థి విద్యార్థినులను ఎంపిక చేస్తామని ఒక ప్రకటనలో శ్రీమతి నారా  భువనేశ్వరి  తెలిపారు . అనాథ నిరుపేద బాల బాలికల కు ఎన్టీఆర్ ట్రస్టు   ద్వారా 2005 సంవత్సరం నుంచి ఉచిత  విద్య అందిస్తున్నట్టు వివరించారు .

                               

                  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు