తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని

 



హైదరాబాదు,జూలై24,టుడే న్యూస్: పాతబస్తీ బోనాల సందర్భంగా జాతీయ  తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు కుటుంబం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు , పోలీసుల సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలను సమర్పించడానికి చేరుకున్న రాష్ట్ర నాయకులకు అక్కన్న మాదన దేవాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆవుల భారత్ ప్రకాష్ , రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు కి, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్ దర్వాజా దేవాలయాన్ని కూడా సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి. సాయి బాబా , జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజు నాయక్ , పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గౌడ్ , పెద్దోజి రవీంద్ర చారి రాష్ట్ర అధికార ప్రతినిధి మ్యాడమ్ రామేశ్వరరావు, అంబర్పేట ఇన్చార్జి బిల్డర్ ప్రవీణ్, ఆర్. భాస్కర్, నల్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు