*శాస్త్రవేత్తల ప్రయోగం సక్సెస్​.. క్యాన్సర్​ను ఖతం చేసే మందు రెడీ!*

     న్యూయార్క్: Medicine: క్యాన్సర్​.. ఈ జబ్బు వచ్చిన వారిలో ఎవరికైనా వ్యాధి నయమైందంటే అదో మిరాకిల్​గానే భావిస్తారు. ఈ ప్రమాదకర వ్యాధికి చెక్​ పెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నా ఎలాంటి ముందడుగు పడలేదు. కానీ చరిత్రలో తొలిసారిగా ఇప్పుడు కీలక పురోగతి లభించింది.

Cancer Medicine: క్యాన్సర్​ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందును కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. ఈ మందు తీసుకున్న బాధితుల్లో పూర్తిగా క్యాన్సర్​ వ్యాధి నయం అయిపోయిందట. ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. అక్కడి శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్​ అయిందని పేర్కొంది. డోస్టర్​లిమాబ్​ పేరుతో పిలిచే మందును వేసుకుంటే రెక్టర్​ క్యాన్సర్​ నుంచి విముక్తి కలుగుతుందని వెల్లడైంది. 18 మందిపై చేపట్టిన క్లినికల్​ ట్రయల్స్​ సత్ఫలితాలు ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మందు తీసుకుంటే ఇక మరే చికిత్స అవసరం లేదని తెలిపారు.

న్యూయార్క్​కు చెందిన మెమోరియల్​ స్లోయన్​ కెట్టెరింగ్​ క్యాన్సర్​ సెంటర్​ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా ఈ పరిశోధన చేస్తున్నారు. రీసెర్చ్​లో సత్ఫలితాలు రావడంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడం చరిత్రలో తొలిసారని అన్నారు పరిశోధకులు డాక్టర్​ లూయిస్​ ఏ.డయాస్​ జే. ఈ మందుతో కిమో​థెరపీ, రేడియేషన్,​ సర్జరీ మొదలైన కష్టమైన చికిత్సలను నివారించొచ్చని పేర్కొన్నారు. క్లినికల్​ ట్రయల్స్​లో భాగంగా 18 మంది బాధితులకు గత ఆరునెలల్లో ప్రతీమూడు వారాలకు ఓసారి ఈ డోస్టర్​లిమాబ్​ ఇచ్చామని వెల్లడించారు. ఆశ్చర్యకరంగా అందరికీ నయమైపోయినట్లు వివరించారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు