జర్నలిస్టు పరశురాం పై దాడి అప్రజాస్వామికం
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్*
(విశాఖపట్నం - 2022అక్టోబర్ 19):నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ఎడిటర్ కోయిలాడ పరశురాం పై జరిగిన దాడి అప్రజాస్వామికమని, ఈ దాడిని తీవ్రంగా
ఖండిస్తున్నామని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.ఇలాంటి చర్యను ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశిస్తూ మీడియా ప్రతినిధుల రక్షణకై కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు.సమాజంలో వేళ్లూనుకున్న ఇటువంటి అసాంఘిక శక్తులను అణచి వేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని కోరారు.జర్నలిస్టు పరశురాం కు జర్నలిస్ట్ సంఘాలన్నీ అండగా నిలవాలని కోరారు..