ఖమ్మంలో టీ-టీడీపీ శంఖారావం సభలో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు









హైదరాబాద్,2022 డిసెంబర్ 21,టుడే న్యూస్:

*తెలంగాణలో టీడీపీ లేదు అన్నవాళ్లు కు ఈ ఖమ్మం సభ సమాధానం*

*రాష్ట్రానికి అభివృద్ధి నడక నేర్పింది తెలుగు దేశం*

*టీడీపీ ఆవిర్భావంతోనే బడుగు వర్గాలకు రాజ్యాధికారం*

*పార్టీ వీడిన నాయకులకు తిరిగి స్వాగతం*

*ఇక తెలంగాణ టీడీపీ  పునర్నిర్మాణం...పూర్వ వైభవం:- సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రసంగం*

• చాలా సార్లు ఖమ్మం వచ్చాను...ఈ స్థాయిలో స్వాగతం ఎప్పుడూ చూడలేదు

• హైదరాబాద్ నుంచి అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు.

• ప్రజలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు.

• మాకు ఐటీ ద్వారా ఉపాధిని ఇచ్చారనే అభిమానంతో యువత కదలి వచ్చింది. 

• ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి జరపుకుంటున్నాం. టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది.

• తెలుగు వాళ్ల కోసం తెలంగాణ గడ్డపై నాడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టారు. 

• సమైఖ్య రాష్ట్రంలో టీడీపీ పాలనతో పెనుమార్పులు వచ్చాయి. 

• అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్

• జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన వ్యక్తి ఎన్టీఆర్

• రెండు రూపాయాలకే కిలో బియ్యంతో ఆహారభద్రతకు బీజం వేసింది ఎన్టీఆర్

• తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఇచ్చిన నేత ఎన్టీఆర్

• సింగిల్ విండో విధానంతో పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు పెట్టారు. 

• ఎన్టీఆర్ తెలుగు వాడి ఆత్మగౌరవం కాపాడారు. నేను తెలుగు వారిలో ఆత్మవిశ్వాసం నింపాను.

• ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపితే ప్రపంచాన్నే జయిస్తారని తెలుగు దేశం పార్టీ నిరూపించింది. 

• నేను వయసులో పెద్దవాడిని అయినా...యువకుడిలా ఆలోచిస్తాను.

• రాబోయే 30 ఏళ్లలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి పని చేస్తాను. ఇదే నా విధానం. 

• నేను ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఎప్పుడూ పని చేయలేదు. 

• బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో మనసు విప్పి మాట్లాడాను. యువతకు వివరించాలని అన్నీ విషయాలపై మాట్లాడాను. 

• హైదరాబాద్ అభివృద్ధికి కారణం ఎవరు? మనమే చేశాం. నాడు ఫౌండేషన్ వేశాము. 

• నేను ఐటీలో అవకాశాలను ముందుగానే ఊహించి హైటెక్ సిటీ ప్రారంభించాను.

• దేశ విదేశాలు తిరిగి కంపెనీలు తెచ్చాను. బిల్ గేట్స్ ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తెచ్చాను. 

• నాడు జినోం వ్యాలీ తీసుకురావడం వల్లే నేడు కరోనా వ్యాక్సిన్ వచ్చింది.

• టెలికమ్యూనికేషన్ సంస్కరణలతో మొబైల్ ఫోన్ రావడానికి కారణం అయ్యాము.

• పాలసీనే మార్చి హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ తెచ్చాము. 

• నాడు ప్రధాని వాజ్ పేయికి చెప్పి ఒప్పించి.... స్వర్ణచతుర్భుజం ప్రాజెక్టు తెచ్చాము. దీంతో రాష్ట్రంలో విశాలమైన రోడ్లు వచ్చాయి.

• స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి కాసాని, యనమల, దేవేందర్ గౌడ్ వంటి వారికి అవకాశాలు ఇచ్చాము. 

• మహేందర్ నాథ్, ప్రతిభా భారతి, బాలయోగి వంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ.

• బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వాములు చెయ్యాలని చెప్పింది. చేసింది టీడీపీ. 

• 30 ఏళ్ల క్రితమే మహిళలకు ఆస్థిహక్కు ఇచ్చిన నేత ఎన్టీఆర్. 

• మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీ తెచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ

• తెలుగు దేశం ఎక్కడ అని అడిగేవాళ్లకు ఈ సభే సమాధానం. 

• రెండు రాష్ట్రాలు మళ్లీ కలిపేస్తాం అని కొందరు బుద్దిలేని మాటలు మాట్లాడుతున్నారు.

• గాడి తప్పిన ఏపీని మళ్లీ గాడిన పెట్టే బాధ్యత నాది. 

• అదేవిధంగా తెలంగాణలో కాసాని లాంటి నాయకులతో టీడీపీ ఆశయాలను నెరవేర్చుతాం. 

• రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కలిసి పనిచేసుకుంటే ఉత్తమ రాష్ట్రాలు అవుతాయి. 

• తెలుగు రాష్ట్రాలు దేశంలో మొదటి, రెండో రాష్ట్రాలుగా ఉండాలి అని కలలుగన్నాను. 

• తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చింది టీడీపీ. నల్గొండలో ఫ్లోరైడ్ బాధితుల కష్టాలు తీర్చింది టీడీపీ. 

• తెలంగాణలో ఉన్న నేతలు అంతా యాక్టివ్ కండి. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. 

• తెలుగు దేశం పార్టీ నుంచి కొందరు నేతలు బయటకు వెళ్లారు.

• ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా  సభ ఇంత ఘనంగా జరిగింది. 

• ఇదీ తెలుగుదేశంకు ఉన్న ప్రజాబలం. 

• తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేస్తుంది.

• విభజన చట్టంలో ఉన్న అంశాలను నెరవేర్చాలి. తెలంగాణలో కాజీపేట్  కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు జరగాలి. 

• ఈ సభా ప్రాంగణం కట్టింది కూడా మనమే. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ చేసిందే.

• ఇక్కడ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది టీడీపీనే. 

• అన్ని రాజకీయపార్టీల కంటే తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఉంది.

• నాడు మనవల్లే అభివృద్ధి జరిగింది. దీని వల్ల లబ్దిపొందిన వాళ్లు టీడీపీ గురించి ఆలోచించాలి. 

•మళ్లీ సమాజంలో శక్తిమంతమైన నాయకత్వం సిద్ధం కావాలి అంటే రావాల్సింది టీడీపీనే.  

• టీడీపీని పునర్ నిర్మాణం చేద్దాం. పూర్వ వైభవం తీసుకువద్దాం. 

• మీ కోసం పని చేసిన తెలుగుదేశంపార్టీని మళ్లీ నిలబెటమని తెలంగాణ ప్రజలను కోరుతున్నాను.

• సుబాబుల్ రైతులు తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. 

• ప్రభుత్వాలకు ఆదాయాలు పెరుగుతున్నాయి. ఆదాయాన్ని పేదలపై ఖర్చు పెట్టి ఆర్థిక అసమానతలు తొలగించాలి. 

• ఖమ్మం సభ చూసిన తరువాత ధైర్యం వచ్చింది. నమ్మకం పెరిగింది. 

• తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పుంజుకుంటుంది.

•ఏపీ కంటే ఎక్కువ అభిమానం తెలంగాణలో కనిపిస్తుంది.

• 25 ఏళ్ల క్రితం మనం చేసిన పనులు గుర్తుచేసుకుంటున్నారు. నీరాజనాలు పలుకుతున్నారు. 

• సభను సక్సెస్ చేసిన అందరికీ అభినందనలు. 

• ఖమ్మంలో జరిగిన మీటింగ్.. టీడీపీని తిరుగులేని పార్టీగా తయారు చేస్తుంది. 

• తెలంగాణలో టీడీపీ అవసరం ఉంది. నేతలు అంతా రావాలని స్వాగతిస్తునామన్నారు.

• దారిపొడవునా అభిమానంతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు