*హీరాబెన్ మృతి పట్ల తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం *


హైదరాబాద్,2022డిసెంబర్ 30, టుడే న్యూస్ :

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల తెలుగుదేశం తెలంగాణ  రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్ధించారు.  కన్న తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రధాని మోడీకి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వంద సంవత్సరాల వయస్సున్న హీరాబెన్ సంపూర్ణ జీవితం గడిపారని, మోడీ లాంటి గొప్ప నాయకుడిని దేశానికి అందించారని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. కొడుకు దేశ ప్రధాన మంత్రి హోదాలో ఉన్నా హీరాబెన్ ఆడంబరాలకు దూరంగా అతి సామన్య జీవితం గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. ప్రధానిగా దేశ సేవలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మోడీ తల్లి హీరాబెన్ కు   సమయం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసుకునేవారని, పండుగలకు తల్లి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకునేవారని తెలిపారు. కొడుకు మోడీ అంటే హీరాబెన్ కు కూడా అమిత ప్రేమ ఉండేదని, అలాంటి మాతృ మూర్తి మరణం బాధాకరమని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నార

         *****   ******   ****** *********  

 *హీరా బెన్  మృతి బాధాకరం:నందమూరి బాలకృష్ణ

ప్రధాని మోదీ తల్లి హీరా బెన్  మృతి బాధాకరం. హీరాబెన్ గొప్ప నాయకున్ని దేశానికి అందించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను.

నందమూరి బాలకృష్ణ

టీడీపీ ఎమ్మెల్యే

    *****     ******      ******

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి గారైన హీరాబెన్‌ మృతి పట్ల పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, బక్కని నర్సింహులు, అరవింద్‌ కుమార్‌గౌడ్‌ తమ సంతాపాన్ని తెలియజేశారు. తన కుమారుడు దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రధాన మంత్రి పదవిలో ఉన్నప్పటికీ హీరాబెన్‌ సాధారణ జీవితాన్ని గడిపి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


హీరాబెన్ మృతి పట్ల కంభంపాటి రామమోహన్ సంతాపం

ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. శతాయుష్కురాలైన హీరాబెన్ సింప్లిసిటీకి మారుపేరు, ఆడంబరాలకు బహుదూరం..

 కొడుకు దేశానికి ప్రధానిగా ఉన్నా  నిరాడంబరతకు మారుపేరుగా ఉండేవారు. కొడుకు అసామాన్యుడైనా, తల్లి మాత్రం అతి సామాన్యురాలుగా ఉండటం ఆమె ప్రత్యేకత. 

హీరాబెన్ ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్ధిస్తున్నాను. ప్రధాని మోదీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను.

కంభంపాటి రామమోహన్ రావు(మాజీ ఎంపి)

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం