లారస్ ల్సాబ్య్ లిమిటెడ్ నాడు నేడు పథకానికి లారస్ ల్సాబ్య్ రూ.4 కోట్లు విరాళం


విజయవాడ, 2023 జనవరి 09,టుడే న్యూస్: లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్ తయారీ మరియు బయోటెక్ కంపెనీ లీడర్స్ ల్యాబ్స్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క "నాడు - నేడు" కార్యక్రమం కింద రూ. 4 కోట్ల రూపాయల విరాళం అందజేశారు మరియు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అధునాతనమైన మరియు అన్ని అత్యాధునికి సౌకర్యాలతో కూడిన కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి కూడా 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు మరియు సి.ఈ.ఓ డా. సత్యనారాయణ చావా, సీఎంతో, తెలిపారు.   లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు మరియు సి.ఈ.ఓ, డా. సత్యనారాయణ చావా, కార్పొరేట్ డెవలప్‌మెంట్, సింథసిస్ మరియు ఇంగ్రిడియంట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణ చైతన్య చావా, మానవ వనరుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ నరసింహారావు చావా, CSR హెడ్ శ్రీమతి సౌమ్య చావా, లారస్ ల్యాబ్స్, ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించే ముఖ్యమంత్రి ఫ్లాగ్‌షిప్ కార్యక్రమానికి గాను రూ. 4 కోట్ల రూపాయల విరాళ పత్రాలను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అందజేశారు. నాడూ -నేడూ పథకం క్రింద లారస్ ల్యాబ్స్ ఈ విరాళాన్ని అందించడం ఇది మూడవసారి.   మరియు అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాలిన గాయాల వార్డు కోసం ఎక ప్రత్యెక వార్డు నిర్మాణానికి మరో రూ 5 కోట్ల కూడ అందిస్తామని కంపెనీ లారస్ ల్సాబ్స్ వ్యవస్థాపకులు & సీఈఓ, ముఖ్యమంత్రికి తెలియజేసారు. అనకాపల్లి ప్రాంత 150కి పైగ భారి పారిశ్రామలు మరియు వందలాదిగా చిన్న మధ్యతరహ పరిశ్రమలకు నిలయం. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండంతో అందుకు దగ్గర్లో మరిన్ని వైద్య సదుపాయాలు అందించే విధంగా ఈ వార్డు ఉపయోగపడనుంది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు