ప్ర‌జ‌ల కోసం..రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం నారా లోకేష్ తొలి అడుగులు





 హైదరాబాద్,2023 జనవరి 25, టుడే న్యూస్: అన్యాయానికి గురైన ప్ర‌జ‌ల‌కు అండ‌గా, ధ్వంస‌మైన రాష్ట్రం పున‌ర్మిర్మాణం ల‌క్ష్యంగా టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ``యువ‌గ‌ళం`` పేరుతో పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. కుప్పం నుంచి శుక్ర‌వారం ఆరంభ‌మై, 4 వేల కిలోమీట‌ర్లు, 400 రోజుల‌పాటు సాగే యాత్ర‌కి శ్రీకారం చుట్టారు. హైద‌రాబాద్ నివాసంలో బుధ‌వారం ఉద‌యం కుటుంబంతో పూజ‌లు నిర్వ‌హించారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న లోకేష్, అత్తామామ‌లు, బంధువులంద‌రి ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా టిడిపి అధినేత చంద్ర‌బాబు కొడుకుని హ‌త్తుకుని ఉద్విగ్నానికి గుర‌య్యారు. ``వెళ్లొస్తాను నాన్నా`` అంటూ తండ్రికి చెప్పిన లోకేష్‌.. త‌న బిడ్డ దేవాన్ష్‌ని అక్కున చేర్చుకుని ``వీడియో కాల్ లో మాట్లాడుకుందాం చిన్నా`` అని స‌ముదాయించి బ‌య‌లుదేరారు.  భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు తాత నంద‌మూరి తార‌క‌రామారావుకి నివాళులు అర్పించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకుని క‌డ‌ప వెళ్లారు. కడపలో నారా లోకేశ్ కి టీడీపీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికాయి. దేవుని క‌డప వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంత‌రం కడప పెద్దదర్గాని సంద‌ర్శించారు. పెద్ద దర్గాలో చాదర్ సమర్పించారు. మత పెద్దలను అడిగి దర్గా విశిష్టతను తెలుసుకున్నారు.

క‌డ‌ప‌లోనే మరియాపురం చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. రోడ్డు మార్గంలో తిరుమ‌ల చేరుకున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం