*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌ||శ్రీ || విజయసాయి రెడ్డి గారిని విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో శనివారం మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన సహకార సంస్థ చేర్ప పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి గారు, విశాఖపట్నం జిల్లా పరిషత్ చేర్పర్సన్ సుభద్ర గారు, ఎస్ కోట మాజీ MLA శోభా హైమావతి గారు*
కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్
: హైదరాబాద్,2024, మే 8,టుడే న్యూస్: ఉత్తరాంధ్రలో కూటమికి ప్రజల మద్దతు బాగుందని నట్టి కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళంలోని 8 అసెంబ్లీ స్థానాలు కూటమివేనని ఆయన స్పష్టం చేశారు. ఇక విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో మాత్రం నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందన్నారు. వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ ప్రముఖులు సిదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలకు ఓటమి తప్పదన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం ఎంపీగా విజయం సాధిస్తారన్నారు. అయితే ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ నాయకులు భూములు భారీగా కబ్జా చేశారని ఆరోపించారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ లక్షా పదివేల ఓట్ల మేజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. కూటమికి సినిమా ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయపడ్డారు.సినిమా వాళ్లు ముందుకు రావాలని ఈ సందర్బంగా నట్టి కుమార్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. చ...