*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌ||శ్రీ || విజయసాయి రెడ్డి గారిని విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో శనివారం మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన సహకార సంస్థ చేర్ప పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి గారు, విశాఖపట్నం జిల్లా పరిషత్ చేర్పర్సన్ సుభద్ర గారు, ఎస్ కోట మాజీ MLA శోభా హైమావతి గారు*
సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం
విశాఖపట్నం,ఎన్ఎన్ఇ న్యూస్: నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమ సుందరరావు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారాన్ని అందుకున్నారు. మహాకవి శ్రీశ్రీ 112 వ జయంతి సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యాన ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో శనివారం జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కవి సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో కవులు రచయితలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ కళా వేదికకు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ అందిస్తున్న మీడియా సహకారానికి కృతజ్ఞతగా ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆరవల్లి నరేంద్ర ఇతర ప్రతినిధులు పూలమాలవేసి దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు.